Sunday, December 29, 2019

CASH WITHDRAWAL THROUGH OTP IN SBI ATMS

ఏటీఎంలో ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా ఒక కొత్త విధానం.


🌻ATM లలో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది SBI. 10 వేల రూపాయల కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే OTP తప్పనిసరి చేసింది SBI.


🌻స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌వర్డ్-OTP తప్పనిసరి. 2020 జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.


🌻ఇప్పటికే కెనరా బ్యాంకు ఏటీఎంలల్లో ఇదే విధానం ఉంది. దేశంలోని ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఇది వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంలల్లో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది


🌻ఎస్‌బీఐ. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది SBI
ఉదాహరణకు మీరు ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు రాత్రి 8 గంటల తర్వాత వెళ్లారనుకుందాం. మీరు కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి.


🌻అంటే మీరు కార్డు ఇన్సర్ట్ చేసి ఓటీపీ తప్పనిసరిగా టైప్ చేయాలి. అప్పుడే డబ్బులు డ్రా అవుతాయి. దీని వల్ల కస్టమర్ల ఖాతాలకు మరింత సెక్యూరిటీ లభించినట్టే. మీ కార్డు పోగొట్టుకున్నా, వారికి పిన్ తెలిసినా డబ్బులు డ్రా చేయలేరు. అయితే ఈ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.


0 comments:

Post a Comment