Wednesday, August 14, 2019

ఆగ‌స్టు 22 నుంచి గ్రామ, వార్డు సచివాలయల‌ పరీక్షల హల్‌టికెట్లు

ఆగ‌స్టు 22 నుంచి గ్రామ, వార్డు సచివాలయల‌ పరీక్షల హల్‌టికెట్లు


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు.
సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆగ‌స్టు 11వ‌ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిరిజా శంకర్‌ ఆగ‌స్టు 13వ‌ తేదీన‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నుట్లు తెలిపారు. 22.73లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది పని చేస్తారని పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖ నుంచే 31 వేల మందిని నియమిస్తున్నామన్నారు.

సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్‌ తెలిపారు. ప్రశ్నా పత్రాలు రెండు భాషల్లో ఉంటాయన్నారు. టెక్నికల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయన్నారు. మొదటి రోజు 12 లక్షల 50 వేల మంది పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీటీవీ, వీడియో కవరేజ్‌ పెట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

ఆగ‌స్టు 22 నుంచి హల్‌టికెట్లు:

పంచాయతీ, మున్సిపల్‌ శాఖలు కలిసి సమన్వయంతో సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ తెలిపారు. ఇప్పటికే పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజ్‌ ఇస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడే నివసించాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రాధాన్యాల ఆధారంగానే గ్రామాలు, వార్డులు కేటాయిస్తామని తెలిపారు. ఆగ‌స్టు 22 నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయని.. నెగిటీవ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుందని తెలిపారు. ప్రతి 4 తప్పు సమాధానాలకు 1 మార్కు నష్టపోతారని సూచించారు. ఎవరైనా పోస్టుల విషయంలో అభ్యర్థులను మోసం చేస్తే క్రిమినల్‌ కేసుల పెడతామని విజయ కుమార్‌ హెచ్చరించారు.

ఫీజు కట్టినవారికే పరీక్ష

గ్రామ సచివాలయాలకు..21.7 లక్షల దరఖాస్తులు  ఇతర రాష్ట్రాల నుంచి 4,903 అప్లికేషన్లు.

సెప్టెంబరు 1 నుంచి 8లోపు పరీక్షలు

గ్రామ సచివాలయ పోస్టులకు సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీలోపు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పంచాయతీ కార్యదర్శి, గ్రామ మహిళా పోలీసు/వార్డు ఉమెన్‌, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు సెప్టెంబరు 1న ఉదయం జరుగుతాయి. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2), వార్డు సౌకర్యాల సెక్రటరీ(గ్రేడ్‌-2) పోస్టుకు సెప్టెంబరు 7న ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. వీఆర్‌వో(గ్రేడ్‌-2), విలేజ్‌ సర్వేయర్‌(గ్రేడ్‌-3) పోస్టులకు సెప్టెంబరు 1న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది.

విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2), విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌, పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్‌, జంతు సంరక్షణ విభాగం సహాయకుడు, ఏఎన్‌ఎం/వార్డు హెల్త్‌ సెక్రటరీ(గ్రేడ్‌-3), విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సెప్టెంబరు 1న మధ్యాహ్నం పరీక్షలు జరగనున్నాయి. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2), వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2) పోస్టులకు సెప్టెంబరు 8న నిర్వహిస్తారు. వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2) పోస్టుకు సెప్టెంబరు 8న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ అభ్యర్థులకు సెప్టెంబరు 8న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది

0 comments:

Post a Comment