Tuesday, May 19, 2020

AP SCHOOLS REOPEN ON AUGUST 3

ఏపీలో ఆగస్టు 3న తెరుచుకోనున్న స్కూళ్లు


ఏపీలోఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. 9 రకాల సదుపాయలను అన్ని స్కూళ్లలో కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామన్నారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలని.. ఈ పనులపై కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సీఎం కోరారు. ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

0 comments:

Post a Comment