గ్రూప్-2 స్ర్కీనింగ్ కటాఫ్ 74.49 ‘ఒకే మార్కు’ వస్తే ఎక్కువ వయసు వారికి చాన్స్
❇హైదరాబాద్,
ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ
సోమవారం విడుదల చేసింది. కటాఫ్ 74.49 మార్కులుగా తేలింది.
❇మెయిన్స్కు
ఎంపికైన మొత్తం 49,100 మంది అభ్యర్థుల
వివరాలను తన వెబ్సైట్లో
ఉంచింది.
❇మొత్తం 150 మార్కులకు స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించగా
తప్పుల కారణంగా 3 మార్కులను
తగ్గించారు. అంటే 147 మార్కులకుగాను 73 మార్కులు వచ్చిన వారికి అర్హత లభించింది.
అయితే 147 మార్కులను 150 మార్కులకు స్కేలింగ్ చేసి చివరికి 74.49ను కటాఫ్ మార్కుగా తేల్చారు. కానీ 74.49 కటాఫ్ మార్కుల్లో అభ్యర్థుల సంఖ్య దాదాపు 2 వేల వరకూ ఉండడంతో వారి పుట్టిన తేదీ ఆధారంగా
ఎక్కువ వయసు ఉన్నవారికి అర్హత కల్పించారు.
❇ఈ పరీక్షలో
అనర్హత పొందిన అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేశారు. స్ర్కీనింగ్ టెస్టులో
అత్యధిక మార్కులు 129.59.
❇క్వాలిఫైయింగ్
రేంజిలో ఉన్నప్పటికీ ట్యాంపరింగ్ కారణంగా 104 మందిని రిజెక్టు చేశారు. రిజిస్టర్ నెంబర్ను,
సెట్ను బబ్లింగ్
చేయకపోవడం, మల్టిపుల్
బబ్లింగ్ చేయడం, ఇష్టానుసారంగా
బబ్లింగ్ చేయడం వంటి కారణాలతో 12,573 మందిని డిస్క్వాలిఫై చేశారు. మెయిన్ పరీక్షను మే 20-21 తేదీల్లో నిర్వహిస్తారు.